మలై కోఫ్తా కర్రీ

కావలసిన పదార్ధాలు: 

 పెరుగు మీద మీగడ : 100 గ్రా. క్యారెట్‌ : 100 గ్రా. ఆనపకాయ : 200 గ్రా. బంగాళాదుంపలు : 100 గ్రా. శనగపిండి : 50 గ్రా. పచ్చిమిరపకాయలు : 20 గ్రా. కొత్తిమీర : రెండు కట్టలు నిమ్మకాయ : సగం చెక్క రిఫైన్డ్‌ ఆయిల్‌ : వేయించడానికి సరిపడా ఉప్పు : తగినంత గ్రేవీ కోసం... జీడిపప్పు : 25 గ్రా. గసగసాలు : 25 గ్రా. కారంపొడి : ఒక టీ స్పూన్‌ పెరుగు : 1/2 టీ స్పూను క్రీమ్‌ : 50 మి.లీ. అల్లం వెల్లుల్లి : ఒక టీస్పూన్‌ ఉల్లిపాయలు : 100 గ్రా. గరం మసాలా : చిటెకెడు

 తయారు చేసే విధానం:

 క్యారెట్‌, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి. ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి. ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వా త తురిమి పెట్టుకున్న క్యారెట్‌, ఆనపకాయల ను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి. దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి. ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి. వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.

గ్రేవీకోసం:జీడిపప్పు, గసగసాలు మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోండి ఒక గిన్నెలో వందగ్రాముల నూనెపోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, వేశాక నూరిన మసాలను కలిపి నూనె తేలేవరకూ ఫ్రై చేయండి. అందులో పెరుగు, గరం మసాలా, తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.

No comments:

Post a Comment