పల్లీ పుట్నాల పప్పు చట్నీ

వేరుశనగ గుళ్లు - 2 కప్పులు కొబ్బరి పొడి - 1 కప్పు పుట్నాల పప్పు - 1 కప్పు (వేయించినవి) పచ్చిమిరపకాయలు - 12 నూనె - 2 టేబుల్‌ స్పూన్లు జీలకర్ర, ఆవాలు - 1 టేబుల్‌ స్పూను ఎండుమిర్చి - 3 పచ్చిశనగపప్పు - 1 టేబుల్‌స్పూన్‌ మినపపప్పు - 1 టేబుల్‌స్పూన్‌ వెల్లుల్లి - 3 రెబ్బలు కరివేపాకు - 2 రెబ్బలు చింతపండు - కొద్దిగా ఉప్పు - సరిపడినంత

 తయారు చేసే విధానం: 

వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనెవేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి పెట్టకోవాలి. ఈ మొత్తానికి వేయించిన శనగగుళ్లు, పుట్నాల పప్పు, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి దాన్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దోరగా వేగాక కరివేపాకు వేయాలి. తరువాత ఆ పోపులో గ్రైండ్‌ చేసి ఉంచుకున్న పల్లీల చట్నీని వేయాలి. ఈ పల్లీల చట్నీని రాగిముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. రాయలసీమ వాసులు రాగిముద్దలోకి ఈ పల్లీల చట్నీని ఇష్టంగా తింటారు.

No comments:

Post a Comment